Wednesday, January 1, 2014

రియాలిటీ చెక్ పుస్తకం మీద కినిగె నోట్

రాజిరెడ్డి వాక్యాలు బయటికన్నా ఎక్కువ లోపలివైపే చూస్తాయి. అక్కడ కనపడిందానికి ఏ అలంకారమూ దిగేయకుండా ఉన్నదున్నట్టుగానే పట్టుకోవాలని అతని ప్రయత్నం. ఈ ప్రయత్నంలోని నిష్ట ఎంత శుద్ధమైనదంటే, అది కథా కవితల్లాంటి ఇంకే ప్రక్రియలోనూ ఇమడక తనదైన ప్రక్రియను కూడా వెతుక్కుని సమకూర్చుకుంది. ఈ ప్రయత్నంలోంచి తెలుగు సాహిత్యానికి ఒక కొత్త గొంతు, తెలుగు వచనానికి ఒక కొత్త వాక్యమూ సమకూరాయి. సాక్షి- ఫన్డేలో ఆయన రాసిన స్థల పురాణాలు (ముఖ్యంగా హైదరాబాద్ స్థల పురాణాలు) ఇప్పుడు పుస్తకంగా వెలువడ్డాయి. బహుశా ఇప్పటి హైదరాబాదుని తనలో బిగించి పట్టుకున్న కాలనాళికగా మున్ముందు ఈ పుస్తకం అలా ఎప్పటికీ నిలిచిపోతుందేమో!
- (మెహెర్) 

No comments:

Post a Comment